ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హైకోర్టులకు కొత్త జడ్జిల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు, తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీం సిఫార్సులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బీఎస్ భానుమతి, సీహెచ్ మానవేంద్రనాథ్రాయ్, ఎం.వెంకట రమణ, ఎ.హరిహరనాథ్శర్మ పేర్లను సిఫార్సు చేయగా.. తెలంగాణ హైకోర్టుకు పి.శ్రీసుధ, పి.సుమలత, ఎన్.తుకారాంజి పేర్లు సిఫార్సు చేశారు.