ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొరపాట్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఈసీ వార్నింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2019, 08:57 PM

స్ట్రాంగ్ రూమ్ నుంచి వాడని ఈవీఎంలను తరలించడంపై సీఈఓ గోపాల కృష్ణ ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన నూజివీడు సబ్ కలెక్టర్, కృష్ణా జిల్లా జేసీల నుంచి వివరణ కోరారు. ఇందుకు స్పందించిన వారు దాదాపు గంటన్నర పాటు ఈవీఎంల తరలింపుపై వివరణ ఇచ్చుకున్నారు.  


నూజువీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కృష్ణాజిల్లా జేసీ మిషా సింగ్ వినియోగించని రిజర్వ్ ఈవీఎంలను తరలించామని అధికారులు చెప్పారు. పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలు రాకముందే వాడని వాటిని ఎందుకు తరలించలేదని సీఈసీ నిలదీసింది. పొరపాట్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఈసీ వార్నింగ్ ఇచ్చింది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com