ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతా కలిసి చేయాల్సిన కుట్రలన్నీ చేశారు : చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 12, 2019, 01:11 PM

నిన్న ఆంధ్రప్రదేశ్ కు ఒక చారిత్రక దినం అని నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఈ రోజు ఇక్కడ విలేకరులతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే..నిన్న జరిగింది ఎన్నిక కాదు, మోడీ, కేసీఆర్, జగన్ తో యుద్ధమని ఆయన అన్నారు. ఇంటికి పెద్ద కొడుకుగా నన్ను భావించి ఓటేసిన అమ్మలకు, అయ్యలకు, రైతు పెద్దన్నగా భావించి ఓటేసిన రైతాంగానికి, అన్నగా భావించి ఓటేసిన చెల్లెమ్మలకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా చేయాలని మోడీ, జగన్, మోడీలు కుట్రపన్నారని చంద్రబాబు చెప్పారు. అయితే ప్రజలు వారి కుట్రలను భగ్నం చేశారని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల సమయంలో అంతా కలిసి చేయాల్సిన కుట్రలన్నీ చేశారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సిఎం కెసిఆర్‌, వైకాపా అధ్యక్షుడు జగన్‌లతో పోరాడాల్సిన అవసరమొచ్చిందని ఆయన చెప్పారు. వారంతా కలిసి కుట్రలు చేశారని ఆయన అన్నారు. ఎపిని అణగద్రొక్కాలనే వారందరి ఆలోచన అని ఆయన అన్నారు. ప్రజలు ఎండను కూడా లెక్క చేయకుండా పోలింగ్‌లో పాల్గొన్నారని, నిన్న చారిత్రక దినమని చంద్రబాబు అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com