ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దారితప్పిన హెలికాప్టర్‌-రంగుల పొగలతో సేఫ్ ల్యాండ్

national |  Suryaa Desk  | Published : Wed, Apr 10, 2019, 07:22 PM

చోప్రాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరు కావాల్సిన  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా నుంచి బయల్దేరారు. అయితే పైలట్ దారితప్పి హెలికాప్టర్‌ను బంగ్లాదేశ్ సరిహద్దు గుండా పక్క రాష్ట్రమైన బిహార్‌లోకి  తీసుకెళ్లాడు. మమత ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారితప్పడంతో అభిమానులు, అధికారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎయిర్ ట్రాఫిక్ అధికారులు రంగంలోకి దిగి మమత హెలికాప్టర్ ను గుర్తించారు. పైలట్‌కు దిశా నిర్దేశం చేస్తూ చోప్రాలోకి వచ్చేలా చేశారు. సభా స్థలిని గుర్తించడానికి ఆ ప్రాంతంలో అధికారలు రంగుల పొగలను గాల్లోకి వదిలారు. వాటిని చూసిన పైలట్ ఎట్టకేలకు గాలి మోటార్‌ను సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో గంట ఆలస్యంగా సభ మొదలైంది. ఆలస్యంగా వచ్చినందుకు తనను క్షమించాలని మమత ప్రలజను కోరారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com