రఫేల్లో మోదీ రూ.30వేల కోట్లు అనిల్ అంబానీకి కట్టబెట్టారని, తాము మోదీలా చేయమని చెప్పారు. కల్యాణదుర్గం ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజకు సాయం చేస్తామని, పెద్ద నోట్ల రద్దు పథకం చేపట్టిన మోదీ దేశంలోని కోట్లాది కుటుంబాలను నాశనం చేశారన్నారు. ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని, ఐదేళ్లుగా ఉద్యోగాలు, ఉపాధి లేక యువత అల్లాడుతున్నారన్నారు. ప్రస్తుతం కోటీశ్వరులు మాత్రమే వ్యాపారాలు చేసే పరిస్థితి ఉందని, బ్యాంకులు సైతం కోటీశ్వరులకే రుణాలిస్తున్నాయన్నారు. విజయ్ మాల్యాకు అరుణ్ జైట్లీ టాటా చెప్పి పంపించారని రాహుల్ విమర్శలు గుప్పించారు.