ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్‌మాల్యా, నీరవ్‌ మోదీ, చోక్సీలకే మోదీ చౌకీదార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 31, 2019, 07:56 PM

‘‘మోదీ పాలనలో ధనవంతులదే రాజ్యమైపోయింద‌ని, విజయ్‌మాల్యా, నీరవ్‌ మోదీ, చోక్సీలకే మోదీ చౌకీదార్ అని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో మాట్లాడుతూ ఆయనకు సామాన్యల ప్రజల బాధలు పట్టవు. దేశంలో మధ్యతరగతి ప్రజలే ఎక్కువ. చిన్న, సన్నకారు రైతులకు గిట్టుబాటు ధర లేదు. మోదీ హయాంలో 15 మంది వ్యక్తుల వద్దే సంపదంతా పోగైంది. మోదీ పాలనలో ప్రభుత్వ విద్యను మరిచిపోయార‌ని, విద్యా వ్యవస్థను కార్పొరేట్‌మయం చేశార‌న్నారు. ఐదేళ్లలో మోదీ ఆ 15 మందికే దోచిపెట్టారు. రూ.15లక్షల కోట్లను ఆ 15 మంది అనుచరులకే పంచిపెట్టార‌ని, మహిళలకు వడ్డీలేని రుణాలు ఇచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేన‌ని, మోదీ పాలనలో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డార‌న్నారు. న్యాయ్‌ పథకంతో పేదరికంపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేయబోతున్నాం. దేశాన్ని ధనవంతులు, పేదలు అని రెండు వర్గాలుగా మోదీ విడగొట్టార‌న్నారు. సామాన్యలుకు సాయం చేసేందుకే మేం న్యాయ్‌ తీసుకువస్తున్నామ‌ని, కోట్ల మంది పేదలకు న్యాయం చేసేందుకే ఈ పథకం తీసుకొస్తున్నామ‌ని చెప్పారు. 5కోట్ల కుటుంబాలకు ఏడాదికి రూ.72వేలు ఆర్థిక సాయంగా ఇస్తామ‌ని, కులం, మతం, ప్రాంతం, పార్టీ.. ఏవీ చూడకుండా ప్రతి పేదవాడినీ ఆదుకుంటామ‌ని తెలియ చేశారు. న్యాయ్‌ పథకం 25 కోట్ల మంది పేదలకు ఉపయోగపడుతుంది’’ అని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com