అలీపూర్దౌర్ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెంగాల్ సంస్కృతిని నాశనం చేశారని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా విమర్శించారు. పశ్చిమ బెంగాల్లోని అలీపూర్దౌర్లో ఎన్నికల సభలో అమిత్షా ప్రసంగించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు దేశానికి ఎంతో ప్రధానమైనవని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్ విషయంలో మాత్రం రాష్ట్రం గుర్తింపును కాపాడుకోవడానికి ఈ ఎన్నికల మరింత ముఖ్యమని ఆయన చెప్పారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే విషయం ఈ ఎన్నికలు నిర్ధారిస్తాయని ఆయన అన్నారు.