గుడివాడ: సంక్షేమ పథకాల అమలులో మనమే నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు. పేదరికం లేని సమాజాన్ని తయారు చేయడమే తన లక్ష్యమన్నారు. నదుల అనుసంధానంతో రికార్డు సృష్టించామన్నారు. నదుల అనుసంధానంతో కరువును పారదోలుతున్నామన్నారు. పట్టిసీమ వద్దని వైసీపీ అడ్డుపడుతోందన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకెళ్తున్నామన్నారు. పసుపు కుంకుమ పథకం కింద మహిళలకు రూ.10వేలు ఇస్తున్నామని, దేవుడు కనికరిస్తే ఎక్కువ కూడా ఇస్తామన్నారు.