ఏపీ అటవీశాఖలో ఖాళీగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (AFSO) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఫిబ్రవరి 12న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 26 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష (స్క్రీనింగ్, మెయిన్) ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. స్క్రీనింగ్ పరీక్షను జూన్ 6న, మెయిన్ పరీక్షను ఆగస్టు నెలలో నిర్వహించనున్నారు. మెయిన్ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తుండగా.. స్క్రీనింగ్ పరీక్షను ఆఫ్లైన్ ద్వారా నిర్వహించనున్నారు. ఒకవేళ స్క్రీనింగ్ పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య 25వేలలోపు ఉంటే.. వారికి కూడా ఆన్లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహించనున్నారు.