ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో భర్త దుర్మరణం, మనస్తాపంతో భార్య ఆత్మహత్యాయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2024, 08:42 PM

రోడ్డు ప్రమాదంలో భర్త దుర్మరణం చెందగా.. దీన్ని తట్టుకోలేక అతడి భార్య పురుగులు మందు తాగింది. ప్రస్తుతం ఆమె శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన నాయిన చంటి (26) శనివారం తన గ్రామం నుంచి బైక్‌పై మురపాక వస్తుండగా.. హనుమయ్యపేట వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను తప్పించబోయి అదుపు తప్పి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయాలు కావడంతో చంటి అక్కడిక్కడే మృతి చెందాడు.


భర్త మరణాన్ని తట్టుకోలేక అతడి భార్య భవానీ ఆదివారం పురుగులు మందు తాగి ఆత్మహత్యహత్యాయత్నానికి పాల్పడింది. ఈమె కూడా ప్రస్తుతం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతుంది. చంటి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరి వివాహం జరిగి ఏడాది కూడా కాలేదు. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా గడుపుతుండగా విధి వక్రీకరించి రోడ్డు ప్రమాదంలో చంటి మృతి చెందడం అందర్ని కలచివేస్తోంది. దసరా రోజున ఇటువంటి ఘటన జరగడంతో కేశవరాయునిపాలెం గ్రామంలో విషాదం నెలకొంది. చంటి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు లావేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com