ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూటమి ప్రభుత్వంతోనే గ్రామ స్వరాజ్యం సాధ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2024, 08:34 PM

పంచాయతీ నిధుల్ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దారి మళ్లించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. నిధుల్ని దారి మళ్లించిన ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. పాలకొల్లు మండలం గోరింటాడ తదితర గ్రామాల్లో సోమవారం పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి గ్రామాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పల్లె పండుగ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ.. "గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఎన్డీఏ సర్కార్‌తోనే సాధ్యమవుతుంది. ఒకే రోజు 13,326 పంచాయతీ గ్రామసభలు, అభివృద్ధి పనులకు తీర్మానాలు చేయడం చరిత్రాత్మకం. పల్లె పండుగలో రూ.4,500 కోట్లతో 30 వేల పనులు చేపడుతున్నాం. సంక్రాంతిలోపు గ్రామాల్లో 3 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు పూర్తిచేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. గత ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసి సర్పంచులు భిక్షాటన చేసేలా చేసింది. జగన్ పాలనలో పంచాయతీ నిధులను కూడా దారి మళ్లించారు" అని మంత్రి పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com