ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడలూరు బోట్స్ పై మండిపడ్డ సోమిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 07:21 PM

నెల్లూరు జిల్లాలో రొయ్యలు, చేపలు పెంపకానికి పెట్టింది పేరని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తమిళనాడు కడలూరు బోట్స్ నిబంధనలను అధిగమిస్తూ వస్తున్నాయని.. కడలూరు బోట్స్ వలన ఆంధ్రప్రదేశ్‌లో మత్సకారులు నష్టపోతున్నారన్నారు. పెద్ద బొట్లల్లో వస్తూ చిన్న చేపలను పట్టుకుపోతూ స్థానిక మత్సకారుల నోళ్లు కొడుతున్నారని మండిపడ్డారు.


కడలూరు బోట్స్ తీర ప్రాంతంలో విధ్వంసం చేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించాలని కోరుతున్నామని చెప్పారు. కృష్ణపట్నం పోర్ట్ బేస్ చేసుకొని అనుసంధాన పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. తరలిపోయిన పరిశ్రమలను వెనక్కు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని సోమిరెడ్డి పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com