ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతన రెస్టారెంట్‌ ప్రారంభోత్సవంలో బంపర్ ఆఫర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 07:20 PM

దసరా వచ్చిందంటే మార్కెట్‌లో ప్రత్యేక ఆఫర్లు హోరెత్తిస్తారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో దసరా సందర్భంగా ఎలకా్ట్రనిక్‌ వస్తువులు, గృహోపరకణాల విక్రయాల్లో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. ఒక రెస్టారెంట్‌ కూడా భోజనప్రియులకు నోరూరించే ఆఫర్‌ ప్రకటించింది. పట్టణంలోని అశ్వారావుపేట రోడ్డులో శనివారం ఒక రెస్టారెంట్‌ ప్రారంభో త్సవంతో పాటు దసరా కానుకగా చికెన్‌ బిర్యానీ కేవలం మూడు రూపా యలకే అందిస్తామని ప్రకటించింది.


ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకే ఈ ఆఫర్‌ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. దీనితో పాటు రూ.290 ధరకు ఒక వ్యక్తి తిన్నంత బిర్యానీ, రూ.380 ధరకు ఒక వ్యక్తి నిర్ణీత నాలుగు రకాల స్టార్టర్‌ ఐటెమ్స్‌లో ఏవైనా ఎంతైనా తినవచ్చు. రూ.580 ధరకు ఇద్దరు వ్యక్తులకు మెనూలో ఉన్న 30 రకాల ఫుడ్‌ ఐటెమ్స్‌ ఎంతైనా తినవచ్చు. ఒక వ్యక్తి రూ.680 ధరకు రెస్టారెంట్‌ లో 400 రకాల ఐటెమ్స్‌లో ఏవైనా ఏంతైనా తినవచ్చు. మరో వంద అదనంగా చెల్లిస్తే 20 రకాల మాక్‌టైల్స్‌, కూల్‌డ్రింక్స్‌ ఎన్నైనా తాగవచ్చని నిర్వాహకులు ప్రకటించడంతో భోజనప్రియులు లొట్టలు వేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com