ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరద బాధితులకి అండగా గుమ్మనూరు జయరాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 07:20 PM

విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆయన కుమారుడు ఈశ్వర్‌ శుక్రవారం విజయవాడకు వెళ్లి మంత్రి నారా లోకేశను కలిసి రూ. 8 లక్షల విరాళాన్ని అందజేశారు. ఎమ్మెల్యే ప్రకటించిన రూ. 5 లక్షల సాయంతో పాటు నియోజకవర్గం తరఫున రూ. 3 లక్షలను కలిపి మొత్తం రూ.8లక్షల చెక్కును మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమస్యలను వారు లోకేశ దృష్టికి తీసుకెళ్లారు. గుంతకల్లుకు ఉర్దూ జూనియర్‌ కళాశాలను ఏర్పాటుచేయాలని, పామిడికి డిగ్రీ కళాశాలను మంజూరు చేయాలని కోరారు. విద్యాభివృద్ధికి తప్పక సహకారాన్ని అందిస్తానని నారా లోకేశ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com