ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మత్స్యకారుల కోసం అద్భుతమైన ఐడియా.. ఈ మెషిన్ గురించి తెలుసా!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 07:15 PM

విశాఖపట్నం జిల్లాలో మత్స్యకారుల కోసం కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లిన సమయంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని అధిగమించేందుకు సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. బోట్లకు సరికొత్త పరికరాన్ని ఫిక్స్ చేస్తున్నారు.. ఆ వివరాలను విశాఖ ఎంపీ శ్రీ భరత్ వివరించారు. విశాఖలో మెకనైజ్డ్ బోట్లకు కాంపోజిట్ సొల్యూషన్ జీపీఎస్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తేవడం ఆనందంగా ఉందన్నారు. డిఫెన్స్, నేవీతో పనిచేసే అవాంటెల్ అనే కంపెనీ ఈ ప్రోడెక్ట్‌ను తయారు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 26వేల మెకనైజ్డ్ బోట్లకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.


విశాఖపట్నంలో 500 ఈ జీపీఎస్ సిస్టమ్‌లను అందించారని.. మరో 100 పరికరాల్ని మత్స్యశాఖకు చెందిన జేడీ ఆర్డర్ చేస్తామన్నారని శ్రీ భరత్ తెలిపారు. మంచి జీపీఎస్ ఎస్‌వోఎస్ సిస్టమ్ ఉంటే మత్స్యకారులకు ఇబ్బంది వచ్చిన వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ కోస్ట్ గార్డ్‌కి, ఫిఫరీస్ డిపార్ట్‌మెంట్‌కి వస్తే.. వెంటనే వెళ్లి వాళ్లను కాపాడొచ్చన్నారు. తాను గతంలో చెప్పినప్పుడు ఇలాంటి సొల్యుషన్ వస్తే బావుంటుంది అనుకున్నానని.. ఇంత త్వరగా ఈ కంపెనీ చాలా మంచి ఐడియాతో ఈ ప్రోడక్ట్‌ను తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు.


ఈ మెషిన్ బోటులో ఫిక్స్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ తనకు చూపించారన్నారు ఎంపీ. అందులో అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయని.. అగ్నిప్రమాదం జరిగితే ఏంటి.. మనిషి బోటులో నుంచి బయటకు పడితే ఏంటి, బోటు డ్యామేజ్ అయితే ఏంటి.. వాతావరణం బాగా లేకపోతే ఏంటి.. ఇవన్నీ మత్స్యకారులకు వార్నింగ్ రూపంలో సమాచారం వెళుతుందన్నారు. ఒకవేళ మత్స్యకారులు బోర్డర్ దాటుతుంటే ఇంటర్నేషనల్ బోర్డర్‌ లోపలికి వెళ్తున్నారని వార్నింగ్ కూడా వస్తుందన్నారు. వీళ్లు మెసేజ్‌లు కూడా ఒక బోట్ నుంచి మరో బోట్‌కు చేయొచ్చని.. ఒక బోట్ నుంచి తిరిగి డిపార్ట్‌మెంట్‌కు కూడా పంపొచ్చన్నారు.


అంతేకాకుండా మత్స్యకారులకు ఎక్కడ ఫిషింగ్ జోన్స్ ఉన్నాయి.. ఎక్కడ ఎక్కువ ఫిష్ కనబడుతున్నాయి అని కూడా వాళ్లకు శాటిలైట్ ద్వారా కమ్యునికేట్ చేస్తుందని భరత్ తెలిపారు. అప్పుడు వాళ్లు ఆ జోన్‌కు వెళ్లగలుగుతారని.. ఇది చాలా మేలు ఈ 600 బోట్లకే కాదు.. మత్స్యకారుల కుటుంబాలందరికి ఒక భద్రతగా ఉంటుందన్నారు. సముద్రంలోకి వెళితే ఏ సమస్య వచ్చినా సరే భద్రంగా వాళ్లని వెతుక్కోగలుగుతామన్నారు. సురక్షితంగా తిరిగి తీసుకొని రాగలుగుతామని.. అందుకే ఈ ప్రోడక్ట్ తీసుకొస్తున్నారన్నారు. అవాంటెల్ కంపెనీ, కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానన్నారు ఎంపీ భరత్. ఈ జీపీఎస్ సిస్టమ్ ద్వారా మత్స్యకారులకు ఎన్నో లాభాలు ఉన్నాయి. సముద్రంలో వేటకు వెళ్లిన సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com