నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును అమలుచేస్తే ఆత్మహత్యలు తప్పవని ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్జీటీ తీర్పును నిరసిస్తూ మామిడికుదురు, కరవాకలోని ఆక్వారైతులు మంగళవారం ధర్నా చేశారు. 300కుటుంబాలు ఆక్వాసాగుచేస్తూ జీవనం సాగిస్తున్నారని, ఈతీర్పును అమలుచేస్తే తామంతా జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా చెరువులకు గండ్లు కొడితే నిరుపేదలమైన తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమకు న్యాయం చేయాలని లేనిపక్షంలో తామంతా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతామని అల్టిమేటం ఇచ్చారు. ఎన్జీటీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తమను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రేకాడి సత్యనారాయణ, రేకాడి నాగరాజు, మల్లాడి వడ్డికాసులు, మాజీ సర్పంచ్ కొల్లు బాలకృష్ణ, మత్స్యకార నాయకుడు కొల్లు జోగిరాజు, రేకాడి దుర్గాప్రసాద్, రేకాడి శేఖర్, తిరుమాని నాగూర్ మీరాసాహెబ్ తదితరులు పాల్గొన్నారు.