ప్రతీ ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. మంగళవారం మలికిపురం పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్చత హీ సేవా ర్యాలీని ఆయన ప్రారంభించారు. మలికిపురం, మోరి, గుడిమెళ్లంక, మోరిపోడు, గొల్లపాలెం తదితర గ్రామాల్లో అట్టహాసంగా ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వరప్రసాద్తో ఎంపీపీ ఎంవీ సత్యవాణి, ఎంపీడీవో మంగాదేవి, సర్పంచ్లు గెడ్డం రాజ్యలక్ష్మి, ముప్పర్తి అలివేలుమంగాత్రివేణి, పద్మమంగతాయారు, పార్టీ మండల అధ్యక్షుడు ముప్పర్తి నాని, అడబాల యుగంధర్, గుండుబోగుల పెదకాపు, గుబ్బల ఫణి, మల్లిపూడి సత్తిబాబు, గెడ్డం తులసీభాస్కర్, గెడ్డం మహలక్ష్మిప్రసాద్, అడబాల రమాదేవి పాల్గొన్నారు.