ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరదబాధితులకు టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు ఉచితంగా,,,,టీడీపీ నేత గొప్ప మనసు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 16, 2024, 10:06 PM

విజయవాడ వరద బాధితులకు అండగా ఎంతోమంది సాయం చేస్తున్నారు. తమకు తోచిన విధంగా విరాళం, నిత్యావసరాలు, బట్టలు అందజేస్తున్నారు. అయితే నగరంలో వరదతో సర్వం కోల్పోయిన వారికి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అండగా నిలిచారు. రోజువారి కూలి పనులు చేసుకునే వారు సైతం నష్టపోయారు. నగర ప్రజల కష్టాలు, బాధలు తనను తీవ్ర ఆవేదనకు గురి చేశాయని వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తన వంతు బాధ్యతగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 5 లక్షల విరాళంగా అందజేశారు.


విజయవాడ వరదల్లో నష్టపోయిన.. టీడీపీ కోసం పని చేసిన కార్యకర్తలను ఆదుకునేందుకు బుద్ధా వెంకన్న ముందుకొచ్చారు. నగరంలో వరదతో వారి నివాసాల్లోని టీవీలు, ఫ్రీజ్‌లను నష్టపోయినవారికి.. తమ కుటుంబ సభ్యుల ద్వారా ఆయా వస్తువులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. 'ఇటీవల భారీ వరదల వల్ల నష్టపోయిన వారికి సహాయార్థం ముఖ్యమంత్రి సహయనిధికి రూ.5లక్షలు అందించాను.. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల ఇళ్ళు వరదలో మునిగి వారి నష్టపోగా వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు నా వంతు సాయంగా వారికి కొత్త ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు, టీవీలు కొనుగోలు చేసి నా సతీమణి భూలక్ష్మి, అల్లుడు రవీంద్ర చేతులమీదుగా అందించడం జరిగింది'అంటూ సోషల్ మీడియాలో తెలిపారు.


తాను ప్రస్తుతం వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నానని.. తాను హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బుద్దా వెంకన్న చెప్పారు. అందుకే తాను రాలేకపోయినా సరే టీడీపీ కోసం పని చేసిన కార్యకర్తలకు తన వంతుగా ఈ సాయం అందిస్తున్నట్లు బుద్దా వెంకన్న తెలిపారు. ఇంకా ఎవరైనా తనతో కలిసి నడిచి.. పార్టీ కోసం పని చేసి వరదల్లో నష్టపోయిన వారి వివరాలను తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. వారందరికీ తన వంతుగా తప్పకుండా సాయం అందిస్తానని చెప్పారు. టీడీపీ నేత బుద్దా వెంకన్న పెద్ద మనసును అందరూ అభినందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com