ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైలం మల్లన్నకు ,,,,20 రోజుల్లో ఏకంగా 3.22 కోట్ల ఆదాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2024, 08:14 PM

నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు సమర్పించిన కానుకలను.. ఆలయంలోని చంద్రావతి కల్యాణమండపంలో లెక్కించారు. హుండీలను పటిష్టమైన భద్రతాఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘా నడుమ లెక్కింపు జరిగింది. గత 20 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.3,22,53,862 నగదు వచ్చింది. 150.1 గ్రాముల బంగారం, 5.250 కిలోల వెండి కూడా కానుకలుగా సమర్పించారు. యూఎస్ డాలర్స్ 746, 125 కెనడా డాలర్లు, 70 యూకే పౌండ్స్‌, 50 ఆస్ట్రేలియా డాలర్లు 50, యూఏఈ దిర్హమ్స్‌, 26 సింగపూర్‌ డాలర్లు, 20 యూరోలు విదేశీ కరెన్సీ కానుకల రూపంలో భక్తులు సమర్పించారు.


మరోవైపు శ్రీశైలం మల్లన్న శాశ్వత అన్నప్రసాద పథకానికి భక్తులు విరాళాన్ని అందజేశారు. ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన పి.శేషగిరిరావు రూ.1,01,116 విరాళాన్ని.. అలాగే అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన బి.పునీత్‌కుమార్‌ రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఈ విరాళాలను దాతలు ఆలయ పర్యవేక్షకురాలు టి.హిమబిందుకు అందజేశారు. ఆలయ అధికారులు దాతల్ని శేషవస్త్రాలు అందజేసి సత్కరించారు. స్వామి, అమ్మవార్ల చిత్రపటం అందించారు.


ఇదిలా ఉంటే.. రెండు రోజుల క్రితం శ్రీశైలంలో చిరుత సంచారం కలకలంరేపింది. నీలం సంజీవరెడ్డి భవనం దగ్గర చిరుత పులి సంచరించింది. భవనం చివరి గేటు దగ్గర చిరుత సంచారాన్ని కొందరు మొబైల్‌లో రికార్డు చేశారు. చిరుత సంచరిస్తుండటంతో భక్తులు, స్థానికులు భయపడుతున్నారు.


మరోవైపు రాఘవేంద్రుల సప్తరాత్రోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఘనంగా జరిగాయి. శ్రీమఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయలు అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం బృందావనానికి నిర్మాల్యం, నవరత్న కవచాలు, విశేష పంచామృతాభిషేకం చేసి బంగారు, వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. అలాగే పీఠాధిపతి పూజా మందిరంలో జయదిగ్విజయ మూలరాములకు విశేష పూజలు చేశఆరు. అనంతరం బృందావనానికి హస్తోదకం సమర్పించి.. మహామంగళహారతి ఇచ్చారు. ఇటు శ్రీమఠంలో పూర్వ పీఠాధిపతి సుజ్ఞానేంద్రతీర్థుల చిత్రపటానికి విశేష పూజలు నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com