ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పలు సంస్థలతో భేటీకానున్న లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 09:33 PM

దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రులు నారా లోకేష్, సత్య కుమార్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈరోజు (సోమవారం) ఎలక్ట్రానిక్స్‌ రంగంలో అగ్ర సంస్థలతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అగ్ర సంస్థలకు వివరించి వారిని రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు.


అలాగే పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. నిన్న (ఆదివారం) రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను లోకేష్ కలిసిన విషయం తెలిసిందే. దాదాపు 40 నిమిషాల పాటు అనేక అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలను అమిత్ షాకు వివరించి... రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నందుకు కేంద్రమంత్రికి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com