ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హనీ ట్రాప్ కేసులో కొనసాగుతున్న విచారణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 09:33 PM

విశాఖ హనీ ట్రాప్ కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. హనీ ట్రాప్ కేసులో అటవీ శాఖ అధికారి వేణురెడ్డికి సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి వేణురెడ్డిని ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో రెండు రోజుల పాటు పోలీసులు విచారించారు. అయితే విచారణ అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన అటవీశాఖ అధికారి.. ఆ తరువాత పత్తాలేకుండాపోయారు. జాయ్ జమీమా ఫోన్‌లో అటవీ శాఖ అధికారికి సంబంధించిన సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది. జమీమా, అటవీ శాఖ అధికారి వేణురెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సమాచారం.


ఈ క్రమంలో వేణు రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. విశాఖ హనీట్రాప్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సూత్రధారిగా ఉన్న జాయ్ జమీమాతో పాటు ఆ గ్యాంగ్ ఎంతోమందిని ట్రాప్ చేసినట్లు తేలింది. హనీ ట్రాప్‌ వ్యవహారంలో బాధితుల జాబితా ఎక్కువగానే కనిపిస్తోంది. జాయ్ జమీమా పెళ్లికాని యువకులతో పాటు వివాహితులను కూడా తన వలలో వేసుకుందని పోలీసుల విచారణలో బయటపడింది. ఎన్‌ఆర్‌ఐ ఫిర్యాదుతో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన జమామీని భీమిలి పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. ఆమె ఎటువంటి సమాచారం చెప్పకపోగా తానే బాధితురాలినని, తననే అంతా మోసం చేశారని చెప్పింది. మరోవైపు హనీ ట్రాప్ కేసులో కీలక సూత్రధారి జాయ్ జమీమా దారుణాలు సోషల్ మీడియాలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జాయ్ జమీమా గ్యాంగ్ ఇచ్చిన మత్తు మందు కారణంగా బాధితులు ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. శరీరంపై పొక్కులు రావడంతో కనీసం పడుకోలేని పరిస్థితి ఏర్పడింది. శరీరమంతా రక్తంతో ఇబ్బంది పడిన ఫోటోలను ఓ బాధితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జాయ్ జమీమా గ్యాంగ్ చేతిలో నరకం అనుభవించానని పోలీసులకు వెల్లడించాడు. ‘‘జాయ్ జమీమా పగలు మేకప్ వేసుకుని.. రాత్రులు బ్రేకప్ చెబుతుంది. జాయ్ జమీమా తెర వెనుక బ్లాక్‌మెయిల్ డ్రామాలు నడుపుతుంది. అర్ధరాత్రి బాధితుల ఇంటికి పోలీసులతో వెళ్లి అరెస్టు చేయాలంటూ హల్ చల్ చేస్తుంది. వెంటనే అరెస్ట్ చేయాలంటూ పోలీసులను సైతం జాయ్ జమీమా బెదిరిస్తుంది. తన తల్లి గెజిటెడ్ ఆఫీసర్ అంటూ మాయ మాటలు చెబుతుంది. నగర సీపీ, కలెక్టర్‌కు తన తల్లి మంచి ఫ్రెండ్’’ అంటూ పోలీసులను బెదిరించిన వీడియోలను బాధిత బంధువులు పోస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com