ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నక్సలిజం రూపుమాపడంలో పోలీసులు సఫలీకృతం అయ్యారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 09:34 PM

పోలీసుల సేవలు వెలకట్టలేనివని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లాలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో మంత్రి  అచెం నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరులకు మంత్రి అచ్చెన్నాయుడు, ఎస్పీ మహేశ్వర రెడ్డి... నివాళులు అర్పించారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ... పోలీస్ వ్యవస్థ లేకపోతే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు. రాష్ట్రంలో నక్సలిజం రూపుమాపడంలో సఫలీకృతం అయ్యారన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ రావాలన్నారు. అనంతపురంలో ఓ అమ్మాయి హత్య కేసును 24 గంటల్లో ఛేదించారని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిపోయిందని.. వాటిపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. విజయవాడ వరదల్లో పోలీస్ సేవలు మారువలేనివన్నారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com