ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరవాడ ఘటనలో చికిత్సపొందుతూ కార్మికుడు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2024, 08:08 PM

ఏపీలోని అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని సినర్జిన్‌ యాక్టివ్‌ ఇన్‌గ్రెడియంట్స్‌ సంస్థలో గాయపడ్డ నలుగురిలో ఒకరు శనివారం చికిత్సపొందుతూ మృతి చెందాడు. 90శాతం గాయాలతో ఇండస్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఝార్ఖండ్‌కు చెందిన రోయా అంగీరియా(21) అనే కార్మికుడు చనిపోయాడు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.సంస్థలోని బీ-బ్లాక్‌ మొదటి అంతస్తు రియాక్టర్‌లో కెమికల్‌ చార్జింగ్‌ చేస్తుండగా మ్యాన్‌హోల్‌ నుంచి రసాయనం ఉప్పొంగి కార్మికులపై పడింది. దీంతో జార్ఖండ్‌కు చెందిన లాల్‌సింగ్‌, కోహర్‌, రోయా, విజయనగరానికి చెందిన కెమిస్ట్‌ సూర్యనారాయణకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖలోని ఇండస్‌ దవాఖానకు తరలించారు. ఇటీవల ఇదే జిల్లా అచ్యుతాపురం సెజ్‌ ఫార్మా పరిశ్రమలో రియాక్టర్‌ పేలి 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com