గ్రామాల అభివృద్ధి కోసమే టీడీపీ కూటమి ప్రభుత్వం గ్రామాల్లో సభలు నిర్వహి స్తోందని, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గానికి రూ15కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామాలను అన్నీ రంగాలలో ముందుకు నడిపించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. గత ప్రభుత్వం పంచాయతీ నిధులను పక్కదారి పట్టించా రన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీలకే కేటాయిస్తోందన్నారు. ఉపాధి పథకం పక్కదారి పట్టకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేయించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఓసూరారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు బండ్లమూడి రాజయ్య, మట్టా రమేష్బాబు, కాజామియా, ఎంపీడీవో టి.పార్వతి, గ్రామసభల ప్రతేకాధికారి నరసింహారావు, పూనూరు భూపాల్రెడ్డి, టీడీపీ మండల అధక్షులు సోరెడ్డి మోహన్రెడ్డి, సాగర్, ఏపీడీ భాస్కర్ పాల్గొన్నారు.