మోదీ ప్రభుత్వ ఆదేశాలకు లొంగిపోయి గత వైసీపీ ప్రభుత్వం ప్రతి ఇంటికి, వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఒప్పందం చేసుకుంది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు అంగీకరించబోమన్న టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాట తప్పింది. స్మార్ట్మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేయకపోగా 56 లక్షల గృహాలకు మొదటి దశలో మీటర్లు బిగించడానికి రంగం సిద్ధ మైంది. ఇది ఎంతవరకు సబబు.’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు ప్రశ్నించారు. రాష్ట్రంలో స్మార్ట్మీటర్ల ఏర్పాటుకు నగరంలోని విద్యుత్ సౌధలోని గోడౌన్లోకి నాలుగు కంటెయినర్లలో శుక్రవారం స్మార్ట్మీటర్లు వచ్చాయని తెలుసుకున్న బాబూరావు సీపీఎం నాయకులతో కలిసి విద్యుత్సౌధ వద్దకు వచ్చి నిరసన తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు స్మార్ట్ మీటర్ల ఏర్పా టును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు వేశారన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందన్నారు. అదానీ, వైసీపీ నేతల బినామీ సంస్థ షిరిడిసాయి కంపెనీలకు స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టు కట్టబెట్టారన్నారు. అదానీ సంస్థ సాంకేతిక నిపుణులు, సిబ్బంది విద్యుత్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారన్నారు. విద్యుత్సౌధలోని గోడౌన్లో రెండంతస్థులు ఖాళీ చేసి అదానీ కంపెనీకి అప్పగించారన్నారు. ప్రీ పెయిడ్ స్మార్ట్మీటర్ల వలన ముందుగానే బిల్లు చెల్లించాల్సి ఉంటుందని, ప్రతి మీటరుకు రూ.13వేల నుంచి రూ,15 వేల వరకు వినియోగదారులే భరించాల్సి ఉంటుందని, ఒకసారి చెల్లించలేకపోతే 93 నెలలపాటు వాయిదాల పద్ధ తిలో చెల్లించాలని ఆయన తెలిపారు. టీడీపీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాం డ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.