ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధోనీ ఫ్యాన్స్‌కు దినేశ్ కార్తిక్ క్షమాపణలు

sports |  Suryaa Desk  | Published : Fri, Aug 23, 2024, 10:02 PM

టీమిండియా మాజీ ప్లేయర్, ఇటీవలే ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన దినేశ్ కార్తిక్ మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పాడు. ఇటీవల తాను ఎంపిక చేసిన ఆల్ టైమ్ ఇండియా ప్లేయింగ్ లెవెన్‌లో ధోనికి దినేశ్ కార్తిక్.. చోటు కల్పించలేదు. దీంతో అతడిపై ధోనీ ఫ్యాన్స్ నుంచి విమర్శలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై దీనేశ్ కార్తిక్ క్లారిటీ ఇచ్చాడు. తాను కావాలని ఇది చేయలేదని.. నిజంగా మర్చిపోయానని చెప్పుకొచ్చాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ధోనీనే బెస్ట్ వికెట్ కీపర్, కెప్టెన్ అని వ్యాఖ్యానించాడు.


 "భాయ్ లోగ్, బడా గల్తీ హో గయా (బాయ్స్, నేను పెద్ద పొరపాటు చేశా). నిజ చెప్పాలంటే.. ఇది కావాలని చేసింది కాదు. ఆ ఎపిసోడ్ పూర్తియ్యాకే నాకు ఈ విషయం అర్థమైంది. జట్టులో మిగతా విషయాలపై ఆలోచించి.. తాను వికెట్ కీపర్‌ను ఎంపిక చేయడం మర్చిపోయా. దీంతో తాను ఎంపిక చేసిన జట్టులో ఉన్న రాహుల్ ద్రవిడ్ వికెట్ కీపర్‌గా ఉంటారని అంతా భావించారు. కానీ నిజంగా నేను వికెట్ కీపర్‌ను ఎంపిక చేయడాన్ని మర్చిపోయా. ఎంఎస్ ధోనీ గొప్ప ప్లేయర్, కెప్టెన్ అందులో అనుమానం లేదు. భారత ఆల్ టైమ్ ప్లేయింగ్ లెవెన్‌లోనే కాదు. ప్రపంచ ప్లేయింగ్ లెవెన్‌లో కూడా అతడికి చోటు ఇవ్వాల్సిందే. నేను ఎంపిక చేసిన భారత ప్లేయింగ్ లెవెన్‌లో మార్పు చేయాలంటే.. కచ్చితంగా అది ధోనీని అందులో చేర్చడమే" అని దినేశ్ కార్తిక్ వ్యాఖ్యానించాడు.


ఇదే సమయంలో మహేంద్ర సింగ్ ధోనీపై డీకే ప్రశంసలు కురిపించాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండే.. ఏ భారత జట్టుకైనా అతడే కెప్టెన్ అని చెప్పుకొచ్చాడు. కాగా కార్తిక్ ఎంపిక చేసిన అత్యుత్తమ ఆల్ టైమ్ భారత జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నారు. డ్యాషింగ్ ఓపెనర్ విరేంద్ర సెహ్వాగ్‌తో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓపెనర్లుగా ఎంపిక చేశాడు. కీలకమైన మూడు, నాలుగు స్థానాల్లో రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్‌లకు చోటు కల్పించాడు. విరాట్ కోహ్లీని ఐదో స్థానంలో ఎంచుకున్నాడు. యువరాజ్ సింగ్‌ కూడా జట్టులో ఉన్నాడు. జట్టులో ఏకైక పేసర్‌గా బుమ్రాకు చోటు కల్పించాడు.


దినేశ్ కార్తిక్ ఎంపిక చేసిన టీమిండియా ఆల్ టైమ్ ప్లేయింగ్ లెవెన్ ఇదే..


వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, రవి చంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జస్‌ప్రీత్ బుమ్రా






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com