ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కూల్ బస్సు బోల్తాపడి 8ఏళ్ల విద్యార్థిని మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 01:36 PM

ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడి 8 ఏళ్ల విద్యార్థిని చనిపోయిన ఘటన అన్నమయ్య జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఓబులవారిపల్లెకు సమీపంలోని శ్రీవాణి స్కూల్ కు చెందిన బస్సు 20 మంది విద్యార్థులతో వెళ్తోంది. ఈ క్రమంలో టైరు రాయి పైకి ఎక్కడంతో బస్సు బోల్తా పడి పక్కనున్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డోర్ పక్కనే కూర్చున్న భవిష్య బయట పడిపోగా, బస్సు ఆ పాపపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందిందని స్థానికులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com