ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరూపిస్తే ఎమ్మెల్యే, మంత్రి పదవులకు గుడ్ బై,,,మంత్రి వాసంశెట్టి సుభాష్ సవాల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2024, 09:46 PM

ఆంధప్రదేశ్ రాజకీయాల్లో మంత్రిపై వస్తున్నఆరోపణలు కలకలంరేపాయి. ఓ మీడియా సంస్థ తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి మండిపడ్డారు.. దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. హైదరాబాద్‌లో గంజాయి సప్లై చేసే వ్యక్తులు దొరికితే.. అతడు తన అనుచరుడు అంటూ ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయితో దొరికిన వ్యక్తికి తనకు సంబంధం ఉందని వైఎస్సార్‌సీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు మంత్రి. ఆ ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవితో పాటూ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానన్నారు.


రాష్ట్రంలో గంజాయి రవాణాతో పాటుగా విక్రయించేవారిని పట్టిస్తే వారికి ప్రభుత్వంతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా రూ.5వేలు ఇస్తానని మంత్రి సుభాష్ ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. రామచంద్రపురం నియోజకవర్గంతోపాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పరిశ్రమలు, విద్యాసంస్థల దగ్గర గంజాయి అమ్మినట్లు, తాగినట్లు తెలిస్తే తనకైనా, పోలీసులకైనా సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్ కారణంగా యువత చెడు వ్యసనాలకు బానిసలై, తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.


రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు మంత్రి సుభాష్. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ల నేతత్వంలో సంక్షేమ అభివద్ధి కార్యక్రమాలలో భాగస్వాములై ప్రోత్సహించాలన్నారు. గంజాయిని పెంచిపోషించిన గత ప్రభుత్వం.. రాష్ట్రంలో యువత భవిష్యత్‌తో ఆడుకుందన్నారు. గంజాయిని అరికట్టేందుకు ఏన్డీఏ ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోందన్నారు. గత ప్రభుత్వం కార్మిక శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసిందని.. కార్మికశాఖలో 3 వేలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. జగన్‌ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన రూ.3 వేల కోట్లను దోచుకుందన్నారు. కార్మికుల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు కేంద్రం ఏటా రూ.450 కోట్లు కేటాయిస్తుందని.. వీటిని కార్మికుల కోసం ఖర్చుచేయకుండా వారి ఆరోగ్యంతో గత ప్రభుత్వం ఆటలాడుకుందన్నారు. అలాగే బాలకార్మికులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com