ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో అసరికొత్త హంగులతో నిర్మాణం,,,క్కడ కొత్త రైల్వే స్టేషన్ ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2024, 09:42 PM

ఏపీలో మరో కొత్త రైల్వే స్టేషన్ ప్రారంభమైంది. అనంతపురం రాయదుర్గం రైల్వే స్టేషన్‌‌లో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు. సిగ్నల్‌ సిస్టమ్‌ను రైల్వే కన్‌స్ట్రక్షన్‌ డిప్యూటీ సీఎస్‌టీఈ శ్వేతా అగర్వాల్‌ పర్యవేక్షణలో ప్రారంభించారు. ఆ రైల్వే స్టేషన్‌లో మొదట గూడ్స్‌ రైలును స్టేషన్‌ మాస్టర్‌ జెండా ఊపి పంపించారు. కొత్త రైల్వేస్టేషన్‌కు మొత్తం రూ.14కోట్ల దాకా వెచ్చించినట్లు రైల్వే ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు జగదీశ్‌సాయి తెలిపారు. రైల్వే స్టేషన్‌లో త్వరలో ప్రయాణికులు కూర్చొనేందుకు సీటింగ్‌ వ్యవస్థ, తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఫ్లాట్‌ఫామ్‌లలో లైటింగ్‌ వ్యవస్థ, స్టేషన్‌లో కమ్యూనిటీ మరుగుదొడ్లను కూడా నిర్మిస్తామని తెలిపారు. త్వరలో స్టేషన్‌ యార్డును విస్తరిస్తామని.. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జికి ర్యాంపు నిర్మాణం చేస్తామన్నారు.


మరోవైపు రైలు ప్రయాణికుల రద్దీని గమనించిన రైల్వేశాఖ.. అనంతపురం మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు గుల్బర్గా - బెంగళూరు మధ్య పట్టాలెక్కనున్నాయి. ఆగస్టు 14, 16, 17వ తేదీల్లో బెంగుళూరు నుంచి రైలు (06533) రాత్రి 9 గంటలకు బయలుదేరి ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని మీదుగా ప్రయాణించి గుల్బర్గాకు మరుసటిరోజు ఉదయం 7.45కు వెళుతుంది. ఈ 15, 17, 18వ తేదీల్లో రైలు తిరుగు ప్రయాణంలో (06534) గుల్బర్గాలో ఉదయం 9.30కు బయలుదేరి అదేరోజు రాత్రి 8కి బెంగళూరు చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలియజేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.


మరోవైపు కడప జిల్లా ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్‌లో ధర్మవరం-మచిలీపట్నం రైలులో బోగీల కింద నుంచి పొగలు వ్యాపించాయి. ఈ ఘటనతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.. రైలు చక్రాలకు ఉండే బ్రేక్‌లు సాంకేతిక లోపంతో పనిచేయకపోవడంతో బ్రేకర్‌ నుంచి పొగలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇలా మామూలుగా జరుగుతుంటాయని రైల్వే సిబ్బంది చెబుతున్నారు. సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో 20 నిమిషాల తర్వాత రైలు అక్కడి నుంచి యథావిధిగా జమ్మలమడుగు మీదుగా వెళ్లింది.. తిరిగి జమ్మలమడుగు రైల్వే స్టేషన్‌లో కూడా ఈ ఎక్స్‌ప్రెస్‌ను పది నిమిషాలపాటు నిలిపి నిశితంగా పరిశీలించారు. అక్కడి నుంచి రైలు ఎలాంటి ఇబ్బంది లేకుండా బయలుదేరడంతో ప్రయాణికులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com