రాష్ట్రంలోని గొప్ప మోడల్ శ్రీకాకుళం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగ్య స్వామి కావాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం సూచించారు. శ్రీకాకుళం నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేషన్ అధికారులు, కాంట్రాక్టర్లతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ నగరంలో కాలువలు, రోడ్లు, పార్కులను నిర్మించి ప్రజలకు త్వరితగతిన అందజేయాలని సూచించారు.