పారిశుద్ధ్య కార్మికులు, సూపర్వైజర్లు ఆరోగ్యం ప్రభుత్వం బాధ్యతని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం అన్నారు. నగరంలోని బాపూజీ కళామందిరంలో ఈఎస్ఐ ఆసుపత్రి, జెమ్స్ వారు సంయుక్తంగా నిర్వహించిన మెడికల్ క్యాంపులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగర పరిశుభ్రతలోనూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ పారిశుధ్య కార్మికులు ప్రత్యేక శ్రద్ధ చెబుతున్నారని తెలిపారు.