ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అమెరికన్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ బి.హడ్డా కలిశారు. హైదరాబాద్లోని జగన్ నివాసం లోటస్ పాండ్లో ఈ భేటీ జరిగింది. మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా... వైఎస్ జగన్తో కలిసి గాంధీ విగ్రహానికి క్యాథరిన్ నివాళులు అర్పించారు. మర్యాదపూర్వకంగానే అమెరికన్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ బి.హడ్డా వైఎస్ జగన్ను కలిసినట్టు వైసీపీ వర్గాలు తెలిపాయి. వైసీపీ మాజీ ఎంపీ మిధున్ రెడ్డి, పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.