ప్రత్యేక హోదా కోసం పోరాడినవారిపై అన్ని కేసులు ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గురువారం నాడు జరిగే కేబినెట్ భేటిలో కేసులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బుధవారం విభజన హామీలు, ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు అఖిలపక్షంభేటీ నిర్వహించారు. కేబినెట్ నిర్ణయం తీసుకుని ప్రత్యేకంగా జీవో విడుదల చేస్తామన్నారు. తటస్థ వర్గాల్ని కూడా కలుపుకుని ఉద్యమం చేపట్టాలి. అసమ విభజనకు వ్యతిరేకంగా పోరాడినవారే మీరంతా. చలసాని, అశోక్ బాబు, బొప్పన వెంకటేశ్వర్లు మీరంతా ఆ రోజు పోరాడారు. అప్పట్లో కేంద్రం వైఖరిపై కోపం ఉంది, ఆక్రోశం ఉంది, అది దారి తప్పితే రాష్ట్రం మరో పంజాబ్ గా మారేదన్నారు. అందుకే నవ నిర్మాణ దీక్షలతో ప్రజల ఆవేశాన్ని అర్దవంతమైన దారిలో పెట్టాను. ఆ రోజు మీలో ఉన్న ఉక్రోషాన్ని, ఆవేశాన్ని అభివృద్ధి వైపు మళ్లించాను. కేంద్రం సహకరించక పోయినా ఇంత పెద్దఎత్తున అభివృద్ధి చేశాం. పేదలకు సంక్షేమం కోసం పనిచేశాను. కేంద్రం తోడ్పాటు ఉంటే మరింత అభివృద్ధి సాధించేవాళ్లమన్నారు. పన్నులు కడుతున్న రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందా లేదా? తెలంగాణాతో సమానంగా మాకు న్యాయం జరగాలని అడుగుతున్నామని ముఖ్యమంత్రి సూటిగా ప్రశ్నించారు.
1న చేపట్టే ఆందోళనలో బ్లాక్ రిబ్బన్ కట్టుకుని బ్లాక్ డే పాటిస్తాం. రాష్ట్ర ప్రజలంతా ఇలాగే తమ తమ నిరసన తెలియజేస్తే బావుంటుంది. కేసులు ఉపసంహరించడానికి వీల్లేదని ఎవరో కోర్టులో పిల్ వేశారు. మంత్రిమండలి సమావేశంలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుని అవసరమైన చట్టం చేసి కేసులన్నీ ఎత్తివేస్తామన్నారు.