ఏపీకి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని గవర్నర్ నరసింహన్ అన్నారు. అసెంబ్లిd సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయసభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. రాష్ట్రాన్ని కరవు రహిత ప్రాంతంగా తయారు చేస్తున్నామన్నారు. నదుల అనుసంధానం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మహాసంగమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని నదుల్ని అనుసంధానిస్తామన్నారు. చేపల ఉత్పత్తిలో దేశంలోనే మనం ముందంజలో ఉన్నామన్నారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్గా మారుస్తున్నామన్నారు. ఫిషరీస్ సెక్టార్ 33 శాతం వృద్ధి సాధించిందన్నారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని, ఎన్టీఆర్ వైద్య సేవ కింద నిరుపేదలకు వైద్య సేవలందిస్తున్నామన్నారు. 13 జిల్లాలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, రూ.2వేలకే డయాలసిస్ సేవలందిస్తున్నామన్నారు. విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నామన్నారు. నాణ్యతాప్రమాణాలోల ఏపీ యూనివర్సిటీలు ముందంజలో ఉన్నాయని వివరించారు. అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం అందిస్తున్నామన్నారు.