ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ తలచుకుంటే ఉక్రెయిన్-రష్యా ఆగిపోవడం పక్కా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 08, 2024, 10:42 PM

రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య రెండున్నర సంవత్సరాలు కొనసాగుతోన్న యుద్ధాన్ని ముగించేందకు భారత్ సహా పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇరు దేశాల మధ్య వివాదాన్ని పరిష్కరించి శాంతి స్థాపనకు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో రష్యా- ఉక్రెయిన్‌ శాంతి చర్చలపై ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్క్-కీవ్ మధ్య వివాదాన్ని పరిష్కరించడంలో భారత్‌, చైనా కీలక పాత్ర పోషిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొడిమిర్ జెలెన్‌స్కీ తమ దేశ పునర్నిర్మాణం, వచ్చే శీతాకాలంలో అందజేయాల్సిన సాయం గురించి ఇటలీలో పర్యటించారు.


ఈ సందర్భంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో జెలెన్‌స్కీ శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మెలోనీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌ వివాద పరిష్కారానికి ఇటలీ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. దేశ సమగ్రతను కాపాడేందుకు రూపొందిచిన నియమాలను పరిరక్షించే లక్ష్యంతో పాటు జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణకు పరిష్కారంలో భారత్‌, చైనాలు కీలక పాత్ర పోషిస్తాయని తాను నమ్ముతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.


‘అంతర్జాతీయ చట్టం నియమాలు ఉల్లంఘిస్తే గందరగోళం, సంక్షోభాన్ని ఎదుర్కొంటాం.. దీర్ఘకాలంలో ఆర్థిక ప్రపంచీకరణ, అంతర్జాతీయ చట్టం నియమాలను ప్రభావితం చేస్తుంది..నేను కూడా నా చైనా మిత్రులకు ఇదే చెప్పాను.. ఉక్రెయిన్‌ వివాదాన్ని పరిష్కరించడంలో చైనా, భారత్ వంటి దేశాలు కీలక పాత్ర పోషించాలని అని భావిస్తున్నాను’ అని ఆమె అన్నారు. కాగా, రష్యాతో యుద్ధానికి ఇటలీ అందిస్తోన్న సైనిక, సాంకేతిక, ఆర్దిక సహకారానికి జెలెన్‌స్కీ ధన్యవాదాలు తెలిపారు. వీలైనంత వేగంగా ఆయుధాలను సరఫరా చేయాల్సి అవసరాన్ని ఉక్రెయిన్ అధ్యక్ష భవనం నొక్కిచెప్పింది.


ఉక్రెయిన్ అధ్యక్షు..డు జార్జియా మెలోనికి యుద్ధభూమిలో పరిస్థితి గురించి, దేశంలోని పౌర, క్లిష్టమైన మౌలిక సదుపాయాలపై ఇటీవల జరిగిన దాడులు, ప్రస్తుత రక్షణ అవసరాల గురించి మాట్లాడారని ఇది మరింత పేర్కొంది. ఇక, గురువారం జరిగిన ఈస్టర్న్ ఎకనమిక్ ఫోర్ 9వ సమావేశంలో పాల్గొన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య శాంతి స్థాపనకు భారత్‌తో పాటు చైనా, బ్రెజిల్‌ మధ్యవర్తిత్వం వహించగలవని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చల కోసం భారత్ దూతగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ వారం మాస్కోకు వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com