ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొగాకులో అన్యపదార్థాలు లేకుండా చూడాలి

business |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 04:37 PM

పొగాకులో అన్యపదార్థాలు లేకుండా చూసుకోవాలని వేలం నిర్వహణాధికారి శ్రీనివాసరావు సూచించారు. టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో సోమవారం రైతులకు పలు సూచనలు చేశారు. అనంతరం నిర్వహించిన వేలంలో తూర్పునాయుడుపాలెం, కాకుటూరివారిపాలెం గ్రామాలకు చెందిన రైతులు 971 బేళ్లను వేలానికి తీసుకురాగా వాటిలో 861 కొనుగోలయ్యాయి. వ్యాపారులు 110 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర రూ. 359, కనిష్ట ధర రూ. 205, సరాసరి రూ. 296. 43 పలికింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com