ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సర్వేరాళ్లపై వేసిన జగన్ బొమ్మలకి ఖర్చెంతో తెలుసా..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 03:54 PM

జగన్‌కు ఉన్న ప్రచారపిచ్చి రాష్ట్ర ఖజానాను గుల్లచేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ‘‘కోటి రూపాయలో, పది కోట్లో కాదు...700 కోట్ల రూపాయల మేర ప్రజాధనాన్ని జగన్‌ తన పేరు, ఫొటోల పిచ్చికోసం తగలేశారు. భూముల సమగ్ర సర్వే పేరిట కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా సర్వేకోసం గ్రానైట్‌ రాళ్లను తీసుకొచ్చి వాటిపై తన తండ్రిపేరు, తనపేరు చెక్కించుకున్నారు. ఈ సరదా తీర్చుకునేందుకు ఆయన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు’’ అని నిగ్గు తేల్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో రెవెన్యూశాఖ కార్యకలాపాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సర్వేరాళ్లు, పాసుపుస్తకాలు తదితర అంశాలపై కీలక చర్చ జరిగింది. ఎలాగైనా రీ సర్వే కొనసాగించాలని కొందరు అధికారులు.. రెవెన్యూశాఖ పెద్దలను భ్రమల్లో పెట్టే ప్రయత్నం చేశారు. అందులోభాగంగా రీ సర్వేను కొనసాగిద్దామనే తరహాలో సీఎం వద్ద ప్రతిపాదనలు ఉంచారు. వాటిని చూసిన ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘‘భూములను రీ సర్వే చేయాలని కేంద్రం నిధులు ఇస్తే జగన్‌ ఏం చేశారు? సరిహద్దులను నిర్దేశించేందుకు సాధారణ రాళ్లను వాడతారు. కానీ జగ న్‌ కేంద్ర మార్గదర్శకాలకు విరుద్దంగా 77 లక్షల ఖరీదైన గ్రానైట్‌ రాళ్లను కొన్నారు. వాటిపై తన పేరును ముద్రించుకున్నారు. పాసుపుస్తకాలపై తనపేరు, ఫొటోలు అచ్చు వేయించుకున్నారు. కేంద్రం చెప్పినదానికి భిన్నంగా రీ సర్వేను తన ప్రచార పిచ్చికోసం వాడుకున్నారు. ఆయన పిచ్చిపనులకు రూ. 700 కోట్ల ప్రజాధనం వృథా అయింది. పాసుపుస్తకాలపై జగన్‌ ఫొటోల ముద్రణ కోసం 15 కోట్లపైనే ఖర్చుపెట్టారు. ఆయన ఫొటోలున్న భూమి పత్రాలను రైతులు చించివేస్తున్నారు. జగన్‌ పేరున్న గ్రానైట్‌ రాళ్లను తమ గ్రామానికి తీసుకురావొద్దని ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఇప్పుడు వాటిని ఏం చేయాలి? రాళ్లపై జగన్‌ పేరు తొలగించాలంటే మరో 15 కోట్లు ఖర్చుపెట్టాలి. ఇంతాచేసి రైతులకు వివాదాలతో కూడిన సర్వే ఫలితాలు ఇచ్చారు’’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. జగన్‌ ప్రచారపిచ్చికి అధికారులు సహకరించారని, నిధుల ఖర్చు విషయంలో ఏమాత్రం అడ్డుచెప్పలేకపోయారని ఆయన తీవ్ర ంగా స్పందించినట్లు సమాచారం. కేంద్ర మార్గదర్శకాలను ఆచరించాల్సిన వారే, ఫొటోల పిచ్చికి సహకరిస్తే ఎలా? వృఽథా అయిన ప్రజాధనానికి ఎవరిని బాధ్యులను చేయాలని ప్రశ్నించినట్లు తెలిసింది. ‘‘సరిహద్దులను నిర్దేశించేందుకు ఎవరైనా ఖరీదైన గ్రానైట్‌ రాళ్లు వినియోగిస్తారా? దీన్ని ఎలా అనుమతించారు? ఎలా సమర్ధించారు? ఆ రాళ్లను ఎలా ఉపయోగించుకోవచ్చు....వాటిని ఏం చేయవచ్చో ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి’’ అని అధికారులకు దిశానిర్దేశం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com