ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉడుపు యంత్రంతో వరి నాట్లు వేస్తే అధిక దిగుబడులు పొందవచ్చు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2024, 02:34 PM

ఉడుపు యంత్రంతో వరి నాట్లు వేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ఏవో రవీంద్ర తెలిపారు. ఎస్ కోట మండలం సీతారాంపురం లో ఉడుపు యంత్రంతో వరి నాట్లు వేస్తున్న తీరును శనివారం పరిశీలించారు. ఈ విధానం వల్ల విత్తన ఖర్చు, కూలీల ఖర్చు తగ్గి ఎకరాకు 5 నుండి 6 క్వింటాల అదనపు దిగుబడి పొందవచ్చన్నారు. ఇప్పటికే మండలంలో 40 ఎకరాల మేర యంత్రంతో రైతులు వరి నాట్లు వేసారన్నారు. వి ఏ ఏ రవి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com