ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతికి రూ.15 వేల కోట్లు ప్రకటించిన కేంద్రం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 08:44 PM

కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహకారం అందించనున్నామన్న ఆమె.. 2024-25 బడ్జెట్‌లో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్ల నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి, పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలూ ఇస్తామన్నారు. విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి.. రాయలసీమ, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రకు నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com