ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధోనీ టీమ్‌లోకి ఎంట్రీ,,,,ఢిల్లీ క్యాపిటల్స్‌కి రిషబ్ పంత్‌ గుడ్‌బై

sports |  Suryaa Desk  | Published : Sat, Jul 20, 2024, 10:29 PM

ఐపీఎల్‌ ఆరంభ సీజన్‌ నుంచి ఆడుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఐపీఎల్‌ 2025కి ముందు భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. గత ఏడేళ్లుగా జట్టుకు హెడ్‌కోచ్‌గా ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను తప్పించిన ఢిల్లీ.. తాజాగా మరో షాక్‌ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఎవ్వరూ ఊహించని విధంగా స్టార్ ప్లేయర్‌ను జట్టు నుంచి తప్పించనున్నట్లు సమాచారం. టీమిండియా వికెట్‌ కీపర్, తమ జట్టు కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ను జట్టు నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.


ఐపీఎల్‌ 2025 మెగా వేలానికి ముందు జట్టులో అట్టిపెట్టుకునే ఆటగాళ్ల విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ తర్జనభర్జన పడుతోంది. అయితే అనూహ్యంగా కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ను కొనసాగించుకునేందుకు మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ ఆసక్తి చూపడ లేదని తెలుస్తోంది. వ‌చ్చే సీజ‌న్ కోసం అత‌డిని అట్టిపెట్టుకోవాలా? రిలీజ్‌ చేయాలా? అని ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం తెగ ఆలోచిస్తోందట. మెగా వేలంలో స్టార్ ప్లేయర్లు సైతం పాల్గొనే అవకాశం ఉన్నందున.. రిషభ్‌ పంత్‌ ప్లేసులో మరో ప్లేయర్‌ను తీసుకోవాలని ఆ జట్టు భావిస్తోంది.


ఢిల్లీ క్యాపిటల్స్‌ పంత్‌ను వదిలేస్తే.. ఎలాగైనా దక్కించుకోవాలని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. మహేంద్ర సింగ్‌ ధోనీ.. ఐపీఎల్‌ 2025లో ఆడతాడో లేడో అన్నది క్లారిటీ లేదు. దీంతో పంత్‌ లాంటి ప్లేయర్‌ను తీసుకుంటే వచ్చే పదేళ్ల పాటు జట్టుకు ఢోకా ఉండదని సీఎస్కే భావిస్తోందట. ధోనీ సూచన మేరకే పంత్‌ను సొంతం చేసుకోవాలని ఆ జట్టు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వికెట్ల వెన‌కాల‌ ధోనీలా చురుకుగా ఉండే, బ్యాటుతోనే విధ్యంసం సృష్టించే పంత్.. తమ జట్టు కూర్పుకు సరిపోతాడని సీఎస్కే ఆలోచిస్తోంది! దీంతో కుదిరితే ట్రేడింగ్ పద్దతిలో లేదా.. వేలంలో పంత్‌ను సీఎస్కే దక్కించుకునే అవకాశం ఉంది.


రోడ్డు ప్రమాదానికి గురైన పంత్.. ఐపీఎల్‌ 2023 సీజన్‌కు దూరమయ్యాడు. కానీ కోలుకున్న తర్వాత వచ్చి ఐపీఎల్‌ 2024తో పోటీ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆటగాడిగా ఫర్వాలేదనిపించినా.. జట్టును ప్లే ఆఫ్స్ చేర్చడంలో మాత్రం విఫలమయ్యాడు. అయితే ప్రస్తుతం జట్టు డైరెక్టర్‌గా ఉన్న సౌరవ్‌ గంగూలీ మాత్రం పంత్‌ను జట్టులోనే ఉంచుకోవాలని భావిస్తున్నాడట. కానీ ఢిల్లీ క్యాపిటల్స్‌ మాత్రం అందుకు సముఖంగా లేదు. ఏది ఏమైనా మరికొన్ని రోజుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ నిర్ణయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అంతవరకు వెయిట్‌ చేయాల్సిందే.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com