ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొనసాగుతున్న జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2024, 05:35 PM

జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం జులై 18న ప్రారంభమైంది. ఈ మెంబర్‌ షిప్‌ డ్రైవ్‌ జులై 28వరకు కొనసాగనుంది. జనసేన క్రియాశీల సభ్యత్వం తీసుకునే సభ్యులకు అనేక ప్రయోజనాలను పార్టీ కల్పిస్తోంది. సభ్యత్వం తీసుకున్న వ్యక్తికి రూ.5లక్షల బీమా ప్రయోజనాన్ని అందిచనుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 6.47 లక్షల క్రియాశీల సభ్యులు ఉండగా.. వీటి రెన్యూవల్‌తో పాటు కొత్త సభ్యులను చేర్చకోవడంపై జనసేన దృష్టిపెట్టంది. కొత్తగా 9లక్షల క్రియాశీల సభ్యత్వాలు చేయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి సంవత్సరం క్రియాశీల సభ్యత్వాల సంఖ్యను పెంచుకోవడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే లక్ష్యంతో జనసేనాని అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకోవడానికి మంచి అవకాశంగా జనసేన భావిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com