ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిటైర్మెంట్‌‌పై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడ్కోలు పలికేది అఫ్పుడే

sports |  Suryaa Desk  | Published : Mon, Jul 15, 2024, 08:41 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. 17 ఏళ్ల తర్వాత భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ అందుకున్న తర్వాత రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచులో గెలిచిన అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించాడు. యువకులకు అవకాశం ఇవ్వడానికి ఇదే సరైన సమయమని.. టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికేందుకు ప్రపంచకప్ గెలిచిన సందర్భాన్ని మించి మరొకటి ఉండదని చెప్పుకొచ్చాడు. భవిష్యత్‌లో టెస్టులు, వన్డేల్లో కొనసాగుతానని వివరించాడు.


 అయితే 37 ఏళ్ల రోహిత్ శర్మ.. టీ20లకు గుడ్‌బై చెప్పడంపై అతడి ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు. అతడు ఇంకా కొంత కాలం టీ20లు ఆడాల్సిందని పేర్కొన్నారు. ఇది ఉఇలా ఉండగా.. మరికొందరైతే.. రోహిత్ శర్మ వచ్చే ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌ మొత్తానికి గుడ్‌బై చెప్పేస్తాడని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు సైతం చేశారు. దీంతో అతడి ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడని తాము బాధపడుతుంటే.. మొత్తానికి గుడ్‌బై చెప్పడమేంటని కంగారు పడ్డారు.


టీ20 ప్రపంచక్ గెలిచిన తర్వాత రోహిత్ వెకేషన్‌లో ఉన్నాడు. ఇటీవల వింబుల్డన్ 2024 మ్యాచులకు సైతం హాజరయ్యాడు. తాజాగా డల్లాస్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడిన హిట్‌మ్యాన్ తన రిటైర్మెంట్ గురించి కుండబద్దలు కొట్టేశాడు. తనకు ఆటకు వీడ్కోలు పలకాలనే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చాడు. ఈ కార్యక్రమంలో రోహిత్‌కు తన రిటైర్మెంట్ గురించి ప్రశ్న ఎదురైంది. దీంతో "మీరు చాలా కాలం పాటు.. నన్ను టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట ఆడటం చూస్తారు" అని అతడు వ్యాఖ్యానించాడు. దీంతో రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడనే వార్తలకు తెరపడినట్లయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


కాగా టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత మాట్లాడిన బీసీసీఐ కార్యదర్శి జైషా.. రోహిత్ శర్మ సారథ్యంలో భారత్.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ 2025 ఆడుతుందని స్పష్టం చేశాడు. తాజాగా రోహిత్ శర్మ చేసిన కామెంట్లను బట్టి చూస్తే.. అతడి అంతకంటే ఎక్కువ కాలమే భారత్ తరఫున ఆడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. రోహిత్ శర్మ కామెంట్లు చూసిన నెటిజన్లు.. రోహిత్ భాయ్.. నువ్వు 2027 వన్డే ప్రపంచకప్ వరకూ క్రికెట్ ఆడు అని పేర్కొంటున్నారు. మరికొందరేమో.. రోహిత్ క్లియర్‌గా చెప్పాడుగా వన్డే ప్రపంచకప్ వరకూ ఆడతాడని కామెంట్లు చేస్తున్నారు. థాంక్యూ రోహిత్ భాయ్ అన పేర్కొంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com