ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిమెంటు రంగంలో ఉన్న సమస్యలని పరిష్కరిస్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 15, 2024, 02:37 PM

సిమెంటు డీలర్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పీలేరు పట్టణంలోని సిమెంటు డీలర్ల అసోసియేషన నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు తాము సిమెంటు రంగంలో వస్తున్న మార్పులు, వాటి వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు తెలియజేశారు. ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌రెడ్డి వారికి తెలిపారు. నగరిపల్లెలో జరిగిన ఈ కార్యక్రమంలో డీలర్లు వాసవీ రవి, ఎస్‌కేఆర్‌ అప్సర్‌, మోహన రెడ్డి, ధర్మయ్య, పురుషోత్తం రెడ్డి, యోగానంద, శ్రీకాంత, ఖాదర్‌, సయ్యద్‌, రాజన్న, చంద్రస్వామి, ఇనాయతుల్లా, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com