ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాత పెన్షన విధానాన్ని అమలుచేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 15, 2024, 02:38 PM

జీపీఎస్‌ అమలు చేస్తూ గెజిట్‌ విడుదల చేయడం తగదని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌వీ రమణ పేర్కొన్నారు. 2023 అక్టోబరు నుంచి సీపీఎస్‌ ఉద్యోగులందరికీ జీపీఎస్‌లోకి తెస్తూ గెజిట్‌ను ఇప్పుడు విడుదల చేయడం అధికారులు, ఉద్యోగులను మోసం చేయడమే అన్నారు. తక్షణమే ప్రభుత్వం పాత పెన్షన పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 2017లో కేంద్రప్రభుత్వం ఇచ్చిన మెమో57ను వెంటనే అమలు చేసి 2003 డీఎస్సీ ద్వారా అపాయింట్‌మెంట్‌ పొందిన ఉపాధ్యాయులందరిని తిరిగి పాత పెన్షన లోకి తీసుకోవాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com