ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా అమ్మ మృతికి కారణం అతనే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 12:46 PM

బేవరేజెస్‌ గోడౌన్‌ కాంట్రాక్టు విషయంలో తన తల్లి సీతామహాలక్ష్మిని ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి,  అతని అనుచరులు బెదిరించి అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీంతో ఆమె మనస్తాపంతో మృతి చెందారని బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ కాంట్రాక్టర్‌ దుగ్గిరాల ప్రభాకర్‌ ఆరోపించారు. గుడివాడ ఆటోనగర్‌లో గురువారం ప్రభాకర్‌ విలేకరులతో మాట్లాడారు. బేవరేజెస్‌ గోడౌన్‌ విషయంలో అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి, నాటి జేసీ మాధవిలతారెడ్డి చేసిన అవినీతిపై సిట్‌కు ఫిర్యాదు చేశానన్నారు. బహిరంగ టెండర్‌ ద్వారా చదరపు అడుగు కేవలం రూ.4లకు బేవరేజెస్‌ గోడౌన్‌ కాంట్రాక్టును తన తల్లి దక్కించుకున్నారన్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్టు కాలపరిమితి కాకుండానే గోడౌన్‌ను అక్రమంగా తరలించారన్నారు. పద్మారెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకు వాసుదేవరెడ్డి ప్రయత్నించారన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే వాసుదేవరెడ్డి తన తల్లిని, తనను తీవ్రంగా దుర్భ లాషలాడారన్నారు.  లక్షలాది రూపాయల కుంభకోణాన్ని పూర్తి ఆధారాలతో సిట్‌కు అందజేశానని దుగ్గిరాల ప్రభాకర్‌ వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com