ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్‌ స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటుకు కృషి చేస్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 12:43 PM

విదేశాలకు వెళ్తున్న టీచర్లు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గొప్ప స్థాయికి వెళ్లాలి. మాతృభూమికి మేలు చేయాలి అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కోరారు. గురువారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ఆధ్వర్యంలో శిక్షణ పొంది విదేశాలకు ఉద్యోగాలకు వెళ్తున్న 120 మందికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఇంత మందికి శిక్షణ ఇచ్చి విదేశాలకు వెళ్లేందుకు సహకరించిన ఎన్‌ఆర్‌ఐ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్‌ రవికుమార్‌ను కొనియాడారు. భువనేశ్వర్‌లో లాగానే వరల్డ్‌ స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. టీడీపీ ఆధ్వర్యంలో శిక్షణ పొంది విదేశాలకు వెళ్తున్న 21 మంది ఐటీఐ, 31 మంది హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు, 68 మంది టీచర్లకు మంత్రి కొండపల్లి శ్రీనివాసుల చేతుల మీదుగా సర్టిఫికేట్లు అందించారు. కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ అధ్యక్షులు డాక్టర్‌ రవికుమార్‌, ఇండియన్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషనల్‌ కన్సల్టెన్సీ అధ్యక్షులు జిలానీ, ఏపీఎన్‌ఆర్‌టీ సీఈఓ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com