ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న భూ రీ-సర్వే లో ఎన్నో అవకతవకలు, ఆందోనలలో రైతులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 04, 2024, 11:42 AM

భూములు రీ-సర్వే జరగడంతో ప్రభుత్వ వెబ్‌సైట్‌లోనే 1-బీ అడంగల్‌ లాక్‌ పడింది. రైతులు కూడా సమస్యను తమ దృష్టికి తీసుకు వస్తున్నారని ప్రభుత్వమే ఈ విషయం పై నిర్ణయం తీసుకోవాలని ఆలూరు తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ అన్నారు. రుణాలు రీ-షెడ్యూల్‌కు 1-బీ అడంగల్‌ అవసరం లేదని, కొత్త రుణాలకు మాత్రమే అవసరం అన్నారు. అయితే బ్యాంక్‌ అధికారులు మాత్రం తప్పనిసరి అంటుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అవసరం అనుకుంటే మీ-సేవ కేంద్రాల్లో మీ-భూమిలో మ్యానువల్‌ తీసుకొని వీఆర్‌తో సంతకం చేసుకుంటే సరిపోతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నా బ్యాంకర్లు మాత్రం అంగీకరించడం లేదు. ప్రభుత్వం త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com