ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్తపాళెంలో అభివృద్ధి పనుల శిలాఫలకం ధ్వంసం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 01, 2024, 01:45 PM

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలం కొత్తపాళెంలో 2023లో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం, నూతన విద్యుత్‌ లైన్ల ఏర్పాటు, పంచాయతీ భవనం రీ మోడలింగ్‌ తది­తర పనులను వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం దాదాపు రూ.20 లక్షలతో చేపట్టింది. ఇందుకు సంబంధించిన శిలాఫలకంలో స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధు­లతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేల పేర్లను ప్రోటోకాల్‌ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేశారు. ఆదివారం గ్రామంలోని టీడీపీ నాయకులు ఈ శిలాఫలకంలో అప్పటి ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలతో పాటు వారికి నచ్చని పేర్లను పచ్చ పెయింట్‌తో తుడి చేశారు. శిలాఫలకం దిమ్మె­లకు కూడా పచ్చ పెయింటింగ్‌ వేశారు. పంచా­యతీ భవనం గోడపై సీబీఎన్‌ అని రాశారు. గతంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్ర­శేఖర్‌రెడ్డి పేరు మాత్రం తొలగించలేదు. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు. ఈ ఘటనపై వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com