తిరుపతి జిల్లా పిచ్చాటూరు ఎంపీడీఓగా శ్రీనివాసులు సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమాలం కొనియాడారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఆదివారం ఎంపీడీఓ శ్రీనివాసులు పదవి విరమణ సందర్భంగా ఎంపీడీఓ దంపతులను శాలువా, గజమాల తో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 39 ఏళ్ల క్రితం ఇదే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా బాధ్యతలు స్వీకరించి నేడు ఇక్కడే ఎంపీడీఓగా పదవి విరమణ పొందడం ఆయన అదృష్టమన్నారు.
![]() |
![]() |