ఎర్రగుంట్ల మండలం వెంకన్నగారిపల్లె వద్ద అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు లారీలు, ఒక టిప్పర్, ఒక జేసీబీని ఆదివారం పోలీసులు సీజ్ చేశారు. గత కొద్దిరోజులుగా అక్రమార్కులు యథేచ్ఛగా జేసీబీలు పెట్టి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న విషయంపై పలు పిర్యాదులు, విమర్శలు రావడంతో పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. వీటిని పోలీసు స్టేషన్కు తరలించామని తెలిపారు.